ముంబై: కోవిడ్ -19 చికిత్సలో కీలకమైన ఫావిపిరవిర్ ఔషధ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించామని దేశీ ఫార్మా కంపెనీ స్ట్రయిడ్స్ ఫార్మా సైన్స్ బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 చికిత్సలో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ యాంటి వైరల్ ఫావిపిరవిర్ టాబెట్లను వాణిజ్య ప్రాతిపదికన తయారీ, ఎగుమతులను ప్రారంభించినట్లు బుధవారం వెల్లడించింది. తద్వారా కరోనా వైరస్ సోకినవారి చికిత్సకు ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ఎగుమతి చేస్తున్న తొలి దేశీ కంపెనీగా నిలవనున్నట్లు ప్రకటించింది. సౌకర్యవంత డోసేజ్ కింద 400 ఎంజీ. 200 ఎంజీబలంతో ఫావిపిరవిర్ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. అంతేకాదు ఈ ఔషధాన్ని దేశీయంగా వినియోగించేందుకు వీలుగా ఔషధ అధికారిక, నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేయనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 20 శాతం ఎగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ .3890 కోట్లకు పెరిగింది. (కరోనా వైరస్ : గ్లెన్మార్క్ ఔషధం!)
కోవిడ్-19 : యాంటీ వైరల్ ట్యాబ్లెట్ల మార్కెట్